మనకి రోజు అన్నం పెట్టే చెయ్యిని నరకడం అంతే ఇదేనేమో ...... మనకి వచ్చే లాభాలని మెరుగుపరచుకునే కంగారులో మన చుట్టూ ఉండే నీరు , భూమి , గాలిని మన చేతులారా పాడుచేసుకుంటున్నాము . వ్యవసాయానికి పెట్టిందిపేరు ఐన మన దేశంలో సంవత్సరానికి కొన్ని భూములలో మూడు పంటలని కూడా పండించగలుగుతున్నాము . కానీ ఈ ప్రక్రియలో మనం చేరుకొని గమ్యాన్ని మరిచిపోతున్నాము. ఒక పంట చేతికి వచ్చాకా రెండవ పంటని అందుకునే కంగారులో పంట వ్యర్ధ పదార్ధాన్ని అక్కడే తగలపెడతారు . దీని వల్ల భూమికి, తరువాత రాబోయే పంటకి మరియు మన చుట్టూ ఉండే గాలికి కూడా ఎంతో నష్టం ఉంటదని నిపుణులు చెప్తున్నారు
** వ్యర్ధ పదార్ధాన్ని పండించే చోటే తగలపెట్టడం వలన ఆ భూమిలో (సిలికా ) పరిమాణత పెరుగిపోతుంది **
** దీనిని కాల్చటం వలన గాలిలో అనేక రకమైన విషవాయువులు (P.M 2.5 ) కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ **
** మరియు దీని నుండి వచ్చే వేడి భూమిలోకి చొచ్చుకునిపోవడం వలన భూమి తేమని కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి **
** దీని నుండి వచ్చే విష వాయువులు ఢిల్లీ పరిసర ప్రాంతాలలో వాయు కాలుష్యానికి ప్రధమ కారణాలుగా కేంద్రం గుర్తించింది **
ఇన్ని నష్టాలూ ఉన్నా ఎందుకు పాటిస్తున్నాము?
1) రెండవ పంట వేసే కంగారులో ఈ సులభమైన పద్ధతిని ఎంచుకుంటున్నాము
2) దీనికి బదులు మెషిన్ కటింగ్ పద్ధతి వున్నా సరే అంత పెట్టుబడి సన్నకారు రైతులు వద్ద ఉండకపోవడం వలన
3) చాల మందికి ఈ విషయంపైనా అవగాహన ఉండకపోవటం వలన
మరి మనం ఎం చేయగలము ?
1) మెషిన్ కట్టింగని తక్కువ ధరకి అందించేలాగా సాంకేతిక వైజ్ఞ్యానాన్ని అందుబాటులోకి తేవడం
2) ఈ వ్యర్ధాన్ని ఆవుపేడ మరియు ఇతర పదార్ధాలతో కలిపినపుడు ఎంతో విలువైన సేంద్రియ ఎరువు తయారవుతుంది. ఇతర రాష్ట్రాల్లో రైతులుకి సరిపడా డబ్బుని అందచేసి, వారి దగ్గరనుండి వ్యర్ధాన్ని సేకరించి ప్రభుత్వమే ఈ పద్ధతిలో ఎరువులని తయారుచేస్తుంది .
3)మరియు ఇతర దేశాల్లో దీనినుండి విద్యుత్పత్తి కూడా చేస్తున్నారు . దేని వల్ల పెట్రోల్ , బొగ్గు మీద ఆధార పడటం తగ్గుతుంది
4) ఛత్తీస్గఢ్ లో సన్నకారు రైతులు "గౌతన్ "గా ఏర్పడి ఊరుకి 5 ఎకరాల చప్పున భూమిలో ఈ వ్యర్ధ పదా ర్ధాలని సేకరించి సేంద్రియ ఎరువులని తయారుచేసి తిరిగి వారి భూమిలో వాడుకుంటున్నారు .
రచన : కె . కృష్ణ అమృత
No comments:
Post a Comment